Homeఇండస్ట్రీ న్యూస్ఉస్తాద్ రామ్ పోతినేని-డబుల్ ఇస్మార్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని-డబుల్ ఇస్మార్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ -క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి. రామ్ మరియు సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ యొక్క క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ ను ముంబైలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. టీమ్ త్వరలో మరో క్రేజీ షూట్‌ ను ప్రారంభించనుంది. రామ్‌ తో పాటు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా తొలి షెడ్యూల్‌ లో పాల్గొన్నారు. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బిగ్ బుల్ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది .

“మా ఫస్ట్ యాక్షన్-ప్యాక్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది మరియు ఇప్పుడు మరో క్రేజీ షూటింగ్ కోసం భారతదేశం నుండి బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది.
#డబుల్‌ఇస్మార్ట్ థియేటర్స్ లో మార్చి 8, 2024
” అని నిర్మాత ఛార్మీ ట్వీట్ చేసారు, రామ్ పోతినేని తో పాటు ఆమె సెల్ఫీని కూడా షేర్ చేశాడు.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌ లో బ్లాక్‌బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్‌ కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.

పూరి జగన్నాధ్ పెద్ద స్పాన్ ఉన్న కథను రాశారు మరియు అతను ప్రధాన నటీనటులను పూర్తిగా స్టైలిష్ గా చూపించనున్నారు. డబుల్ ఇస్మార్ట్ లో రామ్ స్టైలిష్ బెస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని గియాన్నెల్లి పనిచేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో అధిక బడ్జెట్‌ తో డబుల్‌ ఇస్మార్ట్‌ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.

రామ్ పోతినేని, డబుల్ ఇస్మార్ట్ మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments