HomeTollywoodVijay Devarakonda: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా రౌడీ హీరో

Vijay Devarakonda: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా రౌడీ హీరో

దుబాయ్ వేదిక‌గా ఈ రోజు జ‌రుగుతున్న ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇర్ఫాన్ ప‌ఠాన్‌, వ‌సీమ్ అక్ర‌మ్‌ల‌తో క‌లిసి స్టేడియంలో త‌న క్రికెట్ అనుభ‌వాల‌ను గురించి అభిమానులతో పంచుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

టీమ్ ఇండియా క్రికెట‌ర్ల‌తో క‌లిసి స్టేడియంలో ఉండే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని తెలిపాడు. స్టేడియంలో నిల్చొని అభిమానుల‌ను, క్రికెట‌ర్ల‌ను చూస్తుండ‌టం గొప్ప అనుభూతిని కలిగించిందని, వసీస్ అక్రమ్ ను ఆరాధిస్తూ పెరిగానని, ఆ తర్వాత కాలంలో టీమ్ ఇండియా పాలిట విలన్ గా మారడంతో అతడిని ద్వేషించడం ప్రారంభించానని విజయ్ అన్నాడు. ఇండియాతో మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు వసీమ్ బౌలింగ్ స్పెల్ ఎప్పుడూ ముగుస్తుందా అని ఎదురుచూస్తుండేవాడినని విజ‌య్ గుర్తుచేసుకున్నాడు.

పది ఓవర్ల లోపే అతడి కోటా పూర్తవుతుందని అనుకుంటే ఇరవై ఓవర్లు అయినా ముగిసేది కాదని ఇక చేసేందేం లేక అత‌ని రిటైర్ కోసం ఎదురుచూసేవాళ్లమని చెప్పుకొచ్చారు. వసీమ్ బౌలింగ్ లో భారీ షాట్స్ కొట్టాలనే కోరిక ఉండేదంటూ సరదాగా విజయ్ ముచ్చటించాడు. వసీమ్ అక్రమ్, విజయ్ దేవరకొండ మధ్య సాగిన ఈ సరదా సంభాషణ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments